Minister Lokesh: పల్లా శ్రీనివాసరావుకి మంత్రి లోకేష్ అభినందనలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 09:51 PM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivasa Rao) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.
![Minister Lokesh: పల్లా శ్రీనివాసరావుకి మంత్రి లోకేష్ అభినందనలు](https://media.andhrajyothy.com/media/2024/20240625/LOKESH_6_9f1955914c_v_jpg.webp)
అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు (Palla Srinivasa Rao) బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసుకు లోకేష్ అభినందనలు తెలిపారు.
పల్లా శ్రీనివాసరావు పార్టీకి - ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని లోకేష్ ఆకాంక్షించారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేయడమంటే.. బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. నేతలు - కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నారా లోకేష్ సూచించారు.