Share News

Sujana Chowdary: జగన్ ప్రభుత్వంలో యువత జీవితాలు నాశనం

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:13 PM

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్‌లను ఎమ్మెల్యే సుజనా చౌదరి అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో జాబ్‌మేళా పెడితే ఏడు వేల మంది వచ్చారని వెల్లడించారు.

Sujana Chowdary: జగన్ ప్రభుత్వంలో యువత జీవితాలు నాశనం
Sujana Choudhary

విజయవాడ: సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నాడు జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగం పొందిన యువతకు జాయినింగ్ లెటర్‌లను ఎమ్మెల్యే సుజనా చౌదరి (Sujana Choudhary) అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గంలో జాబ్‌మేళా పెడితే ఏడు వేల మంది వచ్చారని వివరించారు. 41 కంపెనీలు ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసుకున్నారని అన్నారు. ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఇలాంటి ఇంటర్వ్యూలకు పంపుతామని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతామని సుజనా చౌదరి ప్రకటించారు.


కేంద్రం ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఇంతమంది నిరుద్యోగ యువత వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం అవుతుందని చెప్పారు. గత ఐదేళ్లల్లో దశ దిశ లేని పాలన వల్ల యువత జీవితాలు నాశనం అయ్యాయని ధ్వజమెత్తారు. విజయవాడతో పాటు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టేలా చూస్తామని స్పష్టంచేశారు. ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా పెడితే నాలుగు జిల్లాల నుంచి యువత వచ్చారని సుజనా చౌదరి వెల్లడించారు.


గత పాలకులు చేసిన పాపాల కారణంగా ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పారు. రెండు నెలల్లో అన్నీ సెట్‌ కావు.. సమయం పడుతుందని అన్నారు. చంద్రబాబు విజనరీపై ప్రజల్లో పెట్టుబడి దారుల్లో నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అందరికీ ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయని సుజనా చౌదరి పేర్కొన్నారు.

Updated Date - Aug 10 , 2024 | 08:23 PM