Share News

Kesineni Chinni: ACA ఎన్నిక‌లు మ‌రో నెల రోజుల్లో.. కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 09:25 PM

ఏసీఏ ఎన్నిక‌లు మ‌రో నెల రోజుల్లో జ‌రుగుతాయని విజ‌యవాడ ఎంపీ, క‌ర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్(చిన్ని) (Kesineni Chinni) తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌గా నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ నియమించినట్లు చెప్పారు.

Kesineni Chinni: ACA ఎన్నిక‌లు  మ‌రో నెల రోజుల్లో.. కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు
Kesineni Chinni

క‌ర్నూల్: ఏసీఏ ఎన్నిక‌లు మ‌రో నెల రోజుల్లో జ‌రుగుతాయని విజ‌యవాడ ఎంపీ, క‌ర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్(చిన్ని) (Kesineni Chinni) తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌గా నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను నియమించినట్లు చెప్పారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు. త్వరలో ఏసీఏ పాలకవర్గం ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.


ఏసీపీ ప్రత్యేక స‌ర్వస‌భ్య స‌మావేశంలో పాత బోర్డ్ స‌భ్యుల రాజీనామాలు ఆమోదించామని వివరించారు. వారు ఏసీఏకి చేసిన సేవ‌ల‌కు కృత‌జ్ఞత‌గా స‌న్మానించామని అన్నారు. ఈ నెల రోజులు ఏసీఏ కార్యక‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఈ క‌మిటీలో ఆర్వీ ఎస్కే రంగ‌రావు, మ్యాన్ చో ఫేరార్, జాగ‌ర్ల మూడి ముర‌ళీ మోహ‌న్ రావు స‌భ్యులుగా ఉంటారని వెల్లడించారు. అనంత‌రం జ‌రిగిన జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో క్రికెట్ స్టేడియాల ప‌రిస్థితిపై చర్చించారు. క్రికెట్ క్రీడాకారుల స‌దుపాయ‌ల‌పై కూడా సభలో మాట్లాడినట్లు కేశినేని చిన్ని తెలిపారు.

Updated Date - Aug 04 , 2024 | 09:29 PM