Share News

Somireddy: తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడు.. జగన్‌కు సోమిరెడ్డి మాస్ వార్నింగ్

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:37 PM

రైతుల పేరుతో జగన్ ప్రభుత్వం అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన దోపిడీదారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు..

Somireddy: తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడు.. జగన్‌కు సోమిరెడ్డి మాస్ వార్నింగ్

నెల్లూరు : జగన్ ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... సూరాయపాలెంలో రూ. 54 కోట్లు, విరువూరులో రూ. 37 కోట్లు పెనాల్టీని మైన్స్ శాఖ వేసిందని గుర్తుచేశారు.


రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన దోపిడీదారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.. మైనింగ్ అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు... ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కరోనా హౌస్‌లో కూర్చుని సర్వేపల్లిని దోచుకున్న వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని విమర్శించారు.


ప్రస్తుతం వచ్చిన రూ. 106 కోట్ల అవినీతి 10శాతం మాత్రమే... ఇంకా 90 శాతం అవినీతి బయటపడాలని అన్నారు.. ఐదేళ్ల అక్రమ ఇసుక, గ్రావెల్, సిలికా, క్వార్ట్జ్ అక్రమాలపై విచారణ జరగాలని చెప్పారు.. ఈ భారీ దోపిడీలో లోటస్ పాండ్‌కి వాటా పోయింది... సజ్జల రామకృష్ణారెడ్డికి వాటా పంపారని ఆరోపించారు. అక్రమంగా ప్రజల సొత్తు దోచేసిన కాకాణిని కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని అన్నారు.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవదేవుడు వదిలిపెట్టడని హెచ్చరించారు. లడ్డూ వ్యవహారంలో ఖచ్చితంగా మంచి విచారణ జరగాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరుకున్నారు.

Updated Date - Oct 04 , 2024 | 01:37 PM