Share News

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం

ABN , Publish Date - Jun 08 , 2024 | 07:40 AM

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.

Ramoji Rao: రామోజీరావు మృతికి ఈటల రాజేందర్ సంతాపం
etala rajender

హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు (Ramoji Rao) మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. ’సామాన్యుడిగా కెరీర్ ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారు. జీవితాంతం నిబద్ధత, క్రమశిక్షణతో ఉన్నారు. చేపట్టిన ఏ పని అయినా సరే నైతిక విలువలు పాటించి మిగతవారికి ఆదర్శంగా నిలిచారు. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వంగా నిలుస్తాయి. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. రామోజీ రావు వామపక్ష భావజాలం కలిగి ఉండేవారు. రామోజీ రావు మహనీయులు. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని’ ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 07:40 AM