Share News

KTR: ఢిల్లీ ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..?

ABN , Publish Date - Jul 28 , 2024 | 10:10 PM

ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పందించారు.

KTR: ఢిల్లీ ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
KTR

హైదరాబాద్: ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (X) వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.


‘‘ఢిల్లీలోని వరదల్లో చిక్కుకున్న ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల విషాద మరణం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. బాధితుల్లో ఒకరైన తానియా సోనీ తెలంగాణకు చెందిన అమ్మాయి అని తెలిసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. హైదరాబాద్ సహా అన్ని ఇతర ప్రధాన పట్టణాల్లో వరద నివారణ చర్యలు తీసుకోవాలి’’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.


Also Read: TG News: ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని మృతి.. కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి..

పోలీసులు తక్షణ చర్యలు

మరోవైపు.. సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ (IAS coaching centre) లోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, అభ్యర్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారం నాడు అదుపులోనికి తీసుకున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌, బిల్డింగ్ మేనేజిమెంట్‌, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ మేనేజిమెంట్‌కు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సెంట్రల్ ఎం.వర్షవర్ధన్ తెలిపారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 105, 106(1), 115(2), 35 కింద కేసులు పెట్టామని, ఇంతవరకూ కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను నిర్బంధంలోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.


పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు..

ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్‌లో వరద పోటెత్తి మరణించిన అభ్యర్థులు ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్, మరొకరిని తెలంగాణకు చెందిన తాన్యా సోని, మూడో వ్యక్తిని కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నెవిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్యయంతో రెస్యూ ఆపరేషన్ నిర్వహించి కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థుల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురునీ గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసినట్టు డీసీపీ తెలిపారు. అభ్యర్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపారు.

అభ్యర్థుల ఆందోళన...

కాగా, అభ్యర్థుల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరనలకు దిగిన విద్యార్థులను అడిషినల్ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ ఆదివారం ఉదయం కలిసి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారని, ఏ విషయాన్ని తాము దాచిపెట్టమని, చట్టబద్ధంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని, విచారణ జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాధ్యతారాహిత్యంపై అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాల్ సైతం ఘటనా స్థలికి వెళ్లి అభ్యర్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన.. జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ..

Bonalu Festival: భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. హాట్ కామెంట్స్..

CM Revanth Reddy: కాంగ్రెస్‌ ఇచ్చిందీ గాడిద గుడ్డే!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 10:11 PM