Ponnam Prabhakar: కిషన్ రెడ్డి.. నీకు దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేసి చూడు..
ABN , Publish Date - Feb 21 , 2024 | 10:42 AM
Telangana: తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కిషన్ రెడ్డి.. నీకు దమ్ముంటే కాంగ్రెస్ను టచ్ చేసి చూడు’’ అంటూ సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని వ్యతిరేకించిన అందరినీ జైలుకు పంపారని.. మరి కేసీఆర్ కుటుంబంపై చర్యలేవి అని ప్రశ్నించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 21: తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై (Telangana BJP Chief Kishan Reddy) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కిషన్ రెడ్డి.. నీకు దమ్ముంటే కాంగ్రెస్ను (Congress) టచ్ చేసి చూడు’’ అంటూ సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని (BJP) వ్యతిరేకించిన అందరినీ జైలుకు పంపారని.. మరి కేసీఆర్ (BRS Chief KCR) కుటుంబంపై చర్యలేవి అని ప్రశ్నించారు. బీజేపీ - బీఆర్ఎస్ (BRS) దోస్తీ ప్రజలకు తెలుసన్నారు. కిషన్ రెడ్డికి పదవి ఇప్పించింది కేసీఆరే అని అన్నారు. కిషన్ రెడ్డిని.. నామినేటెడ్ బై కేసీఆర్ అంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్టు తెలంగాణలో కుదరదన్నారు. బీజేపీ - బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నది తమకు తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు (Loksabha Elections) ముందే ఏదో చేయబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అనమానం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..