Share News

Komatireddy: నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:41 PM

Telangana: నల్గొండ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని... పేదవాడికి అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కెవీ సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్గొండ టౌన్‌ను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు.

Komatireddy: నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..

నల్గొండ, జూలై 1: నల్గొండ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని... పేదవాడికి అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. సోమవారం పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కెవీ సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్గొండ టౌన్‌ను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. రూ.700 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నామని.. ఎవరికీ నష్టం చేయమని తెలిపారు.

Pitani Satyanarayana: పెన్షన్లు పెంచాం... పొద్దు పొద్దున్నే అందించాం


తనకు ఐదు గజాల భూమి లేదని... ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. మార్కెట్ ధర కన్నా ఎక్కువ నష్టపరిహారం ఇస్తామన్నారు. ఎస్ఎల్‌బీసీ సెంటర్ వద్ద అన్ని వసతులతో మల్టీపర్పస్ హాస్టల్ కట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాధికారులకు ఆదేశించామని.. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన తీసివేయాలని ఆదేశించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి....

AP Pensions: ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ..

KCR: తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 03:46 PM