Share News

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌!

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:02 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నట్టు సమాచారం.

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌!

  • వరంగల్‌లో ‘కృతజ్ఞతా సభ’కు రాహుల్‌కు ఆహ్వానం!

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో భేటీ కానున్నట్టు సమాచారం. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌ సభలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రుణమాఫీ పథకం అమలుచేసిన విషయాన్ని వారికి తెలియజేయనున్నారు.


వరంగల్‌లోనే ‘కృతజ్ఞతా సభ’ నిర్వహించాలని నిర్ణయించామని, ఆ సభకు రావాలని రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలిసింది. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, ఐమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెళతారని సమాచారం. కాగా, వరంగల్‌లో కృతజ్ఞతా సభ ఏర్పాట్లపై రాష్ట్ర పార్టీ నేతలు దృష్టి సారించారు.

Updated Date - Jul 19 , 2024 | 03:02 AM