Home » 2024
ఇచ్చిన హామీలన్నింటిని ఈ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలో విసృతంగా పర్యటించారు. మండలంలోని కుంటిమద్ది, గంగంపల్లి, మా దాపురం, కొత్తగాదికుంట, నసనకోట, దుబ్బార్లపల్లి, తిమ్మాపురం, గరిమేకల పల్లి గ్రామాల్లో రూ.3.60కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 13వేలకు పైగా పోలింగ్ కేంద్రాలలో మొత్తం 2.2 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో అక్రమాదాయానికి కొదవ ఉండదనేది బహిరంగ రహస్యమే. అలాంటి శాఖలో బదిలీలు అంటే మామూలు విషయం కాదు. కొన్ని సీట్లు భారీగా విలువ పలుకుతున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. ఎంతైనా ఇచ్చుకునేందుకు పలువురు అధికారులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఆ శాఖలో ప్రస్తుతం బదిలీల గోల సాగుతోంది. ముందు క్యాష్ కొట్టు... పోస్టు పట్టు అనే నినాదం వినిపిస్తోంది. ఆ శాఖలో సబ్రిజిస్ర్టార్లదే హవా. ఆ తరువాత ఇనచార్జిగా పనిచేసే...
వైసీపీ నిరంకుశ పాలనతో గాడితప్పిన వ్యవస్థలను చక్కదిద్ది.. ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా రామసాగరంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతామని, సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్ అన్నారు. పొలంబడి, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర ...
ఉద్యోగ, ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పెంగింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణా రెడ్డి, రామాంజినేయులు డిమాండ్ చేశారు. నార్పల మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
స్థానిక ఉన్నతపాఠశాలలో శుక్రవారం స్కూల్ గేమ్స్ పోటీలు హెచఎం ఓబుళమ్మ ఆధ్వర్యంలో హోరాహోరీగా జరి గాయి. మొదటి రోజు అండర్-14,17 క్యాటగరీలలో బాలికలకు పోటీలు నిర్వి హంచారు. మొత్తం 150 మంది బాలికలు పాల్గొన్నారు. క్రీడలు, అథ్లెటిక్స్ పోటీలలో పలు పాఠశాలల బాలికలు ప్రతిభను కనబరిచినట్లు పీడీ నల్లప్ప తెలిపారు.
ఐదేళ్ల పాటూ అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ముం దుగా ముత్తవ కుంట్లలో భూమిపూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంత రం బాలేపాళ్యం, కనగానపల్లి, తూంచెర్ల, తగరకుంట, వేపకుంట, మద్దెల చెరువు గ్రామాల్లో రూ. 3.60 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి... వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనపై టీడీపీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... గురువారం సీఎం చంద్రబాబు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ స్థానిక కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.