Home » 2024
అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి ఏడాది..! ఇంటిల్లిపాదీ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. రోజులు గడుస్తున్నా బిడ్డ పరిస్థితి మెరుగుపడలేదు. ‘బెంగళూరుకో, కర్నూలుకో పోతాం.. రాసివ్వండి సార్..’ అని డాక్టర్ను అడిగితే.. ‘అంతా మీ ఇష్టమేనా..? ఇక్కడే బాగవుతుందిలే..’ అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఏమీ అనలేకపోయారు. ఇంకో రెండు రోజులు గడిచాక.. పరిస్థితి విషమించింది. ‘అంబులెన్స మాట్లాడుతా..! అందులో ఆక్సిజన ఉంటుంది. పెట్టుకోని వెంటనే ...
మండలంలోని చెదళ్ల గ్రామంలో మంగళవారం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్రమించిన వాటర్ ప్లాంట్, ట్రెంచను తొలిగించేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసులను అడ్డుకున్నారు. అక్రమణలు తొలిగించేందుకు వెళ్లిన ఎక్స్కవేటర్ను వైసీపీ మద్దతు సర్పంచ, అనుచరులు ధ్వంసం చేశారు. పోలీసులు చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ ...
ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈక్రమంలోనే ఒకరి ట్రాక్టర్లను మరొకరు పట్టుకుంటున్నారు. వారంరోజుల కిందట కరకముక్కల గ్రామానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లు విడపనకల్లుకు వచ్చాయి. వాటి విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు విడపనకల్లు ఎస్ఐ ఖాజా హుస్సేనకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని పట్టుకుని స్టేషనకు తరలించారు. కరకముక్కల టీడీపీ నాయకులు రంగంలోకి ...
చేతి వాటం శ్రుతిమించింది. కొందరు మండల విద్యాశాఖాధికారు(ఎంఈఓ)లు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను సైతం టార్గెట్ చేసి దోచేస్తున్నారు. కొందరు ఎంఈఓలు.. విజిట్లు చేసి, బెదిరిస్తూ... డబ్బు గుంజుతున్నారు. మరికొందరు.. ఉపాధ్యాయ సంఘాలను తమ చేతుల్లో పెట్టుకుని టీచర్లను టార్గెట్ చేసి, చర్యలు తీసుకుంటామంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ...
నియోజకవర్గంలోని గ్రామల్లో తాగునీటి సమస్యను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించాలని ఎమ్మెల్యే బండా రు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన అధికారుల తో సమావేశం నిర్వహించారు.
ఎస్కేయూ ప్రాంగణ పరిసరాలను హరితవనంలా తీర్చీదిద్దుతామని రిజిస్ర్టార్ డాక్టర్ రమేష్బాబు పేర్కొన్నారు. వర్సిటీ వృక్షశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రవిప్రసాద్ ఆధ్వర్యం లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా రెక్టార్ వెంకటనాయుడు, రిజిస్ర్టార్ రమేష్బాబు మొక్కలు నాటారు. వర్సిటీలో బొటానికల్ గార్డెన ఏర్పాటు కోసం వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరు వేల రకాల మొక్కలు పెంచుతున్నామని తెలిపారు.
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్ క్రికెట్ పోటీలు గురువారం నుంచి అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు దులీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పా ట్లు చేస్తోంది. ఏసీజీలో ఇండియా ఏ, బీ, సీ, డీ జట్ల ప్లేయర్లు మంగళవా రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఉద యం ఇండియా-సి, ఇండియా-బి, మధ్యాహ్నం ఇండియా-ఎ, ఇండియా-డి జట్ల ఆటగాళ్లు సాధన చేశారు.
డ్రిప్ పరికరాల మంజూరులో జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వినోద్కుమార్ సంబంధిత అధికారులు, డ్రిప్ కంపెనీల ప్రతినిధులకు ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స హాల్లో ఏపీఎంఐపీ అధికారులు, డ్రిప్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాకు 37500 హెక్టార్లల్లో డ్రిప్, స్ర్పింకర్ల మం జూరు కోసం ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు.
ఒకవైపు రైతులు హెచఎల్సీలో నీరు ఎప్పుడు ప్రవహిస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నారు. అదిఅలా ఉంచితే... ఆ నీరు రాకపోవడంతో వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు, ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన మండల వాసులు వినాయక విగ్రహాల నిమజ్జనం హెచఎల్సీలో అలాగే వదిలేశారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ప్రజలకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీటి కరువు ఎదురైంది.
మండలంలోని చిన్న జలాలపురం అంగన వాడీ కేంద్రం వద్ద పెరిగిన గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించాలని పిల్లలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన రెండు అంగనవాడీ కేంద్రాలను ఒక భవనంలో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 30 మంది వస్తారు.