Home » Ayyanna Patrudu
వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో అయ్యన్నపాత్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో మొట్ట మొదటి సారిగా చదువుకునే విద్యార్థులకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం ఆయన కల్పించారు.
తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది.
Andhrapradesh: గత సమావేశాల వరకూ గవర్నర్ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీకి ఉన్న రెండో గేటును స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెరిపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల కష్టాలు వినిపించకూడదని.. ఓ నియంతలా వ్యవహరిస్తూ.. అసెంబ్లీకి అడ్డుగోడ నిర్మించారు. అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి రెండో గేటును మూసివేయించి అడ్డుగా గోడ నిర్మించారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు.
కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు.
Andhrapradesh: రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను స్పీకర్ సందర్శించారు. సీఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు 288 స్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు.