Home » TDP
రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్నకాలనీలో ఇసుక దొంగలు పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వేల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే తరలించేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు తోడు దొంగలుగా మారి ఈ బాగోతాన్ని నడిపించారు.హౌసింగ్ ఏఈ కేవీ భాస్కర్ ఫిర్యాదుతో వారిపై ద్రాక్షారామ పోలీసులు కేసులు నమోదు చేశారు.
పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా
ప్రత్తిపాడు, ఆగస్టు 28: ఆయిల్పామ్ రైతులకు అన్నివిధాలుగా ఉద్యానవనశాఖ ఏపీ ఆయి ల్ ఫెడ్లు, ప్రోత్సాహకాలు అందిస్తుందని లాభదాయకమైన ఈ పంటలసాగును రైతులు విస్తరించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కోరారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల ఆయిల్పామ్ రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవ
అనంతపురం నగరంలో నడిమి, మరువ వంకలకు రక్షణ గోడల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి దగ్గుపాటి మంత్రికి వినతి పత్రం అందజేశారు.
తనకు సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుపడుతున్న జగన్.. తన సొంత పార్టీ నాయకులను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారా అంటే..
ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తాడిపత్రిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక అక్రమ రవాణాకు రూరల్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి సహకరిస్తున్నారని, వాహనాలను పట్టించినా కేసులు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి మంగళవారం ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులతో కలిసి రూరల్ పోలీ్సస్టేషన ఎదుట ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తన అనుచరుల బృందాన్ని ఏర్పాటు ...
పురపాలక సంఘం స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారు నియామకం విషయంగా బుధవారం మునిసిపల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య బల ప్రదర్శన జరగనుంది. గతంలో నియమించిన స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారుగా జీపీ తిమ్మారెడ్డి రాజీనామా చేయడం తో ఆ పోస్టు నియామకానికి కౌన్సిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 13వ తేదీన దరఖాస్తు గడువు ముగియడంతో బుధవారం నిర్వహించేసాధారణ సమావేశంలో ...
కడపలో లోకల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య చెత్తపై యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా రాజకీయాలు సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది.
గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి గుణపాఠం రాలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో అందరూ సోదర భావంతో ఉన్నామని, కొందరు ఉద్దేశ పూర్వకంగా రాజకీయాలను కులా లకు అపవాదించి లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ నియోజక వర్గం వక్కలిగ సంఘం నాయకులు అన్నారు. టీడీపీ మడకశిర, అగళి, అమరాపురం మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, కుమారస్వామి, గణేష్ తదితరులు సోమవారం రాత్రి బాలాజీనగర్లోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.