Home » TDP
తెలంగాణ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారనే చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఈ అంశంపై నాయకులకు స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.
దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి లీడ్లో దూసుకుపోతోంది. ఇండియా కూటమికి, ఎన్డీయేకు మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి.కామ్ అందిస్తోంది.
Andhrapradesh: అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. ‘‘జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడు’’ అంటూ మండిపడ్డారు.
Andhrapradesh: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
Andhrapradesh: అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. స్వర్ణ గ్రామ పంచాయతీ రూపకల్పన దిశగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో శుక్రవారం గ్రామ సభలను నిర్వహించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు ఇందులో భాగమయ్యారు. ప్రాధాన్యక్రమంలో అభివృద్ధి అంశాలను చర్చించారు. తొలి అంశం మరుగుదొడ్లు, విద్యుత, తాగునీటి కొళాయిలు, వంట గ్యాస్ కనెక్షన్లు, రెండో అంశం మురుగునీటి వ్యవస్థ, ఘనవ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, ...
ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన సొంత పత్రిక అక్కసు వెళ్లగక్కుతున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు భక్తర్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన నరసింహ రాజు తదితరులు శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కా రం కోసం ఎమ్మెల్యే సొంత డబ్బుతో దాదాపు 20 బోర్ల వరకు వేయించా రని అన్నారు.
ఏపీ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు రూ.40 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటే శ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో రూ.40 లక్షల మెగా చెక్ను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.
పంచాయతీల నిధులను దారిమళ్లించిన గజ దొంగ వైఎస్ జగన అని, వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. ముత్తవకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.