Home » TG Govt
కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దశ దిశ లేని పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. ఒక విజన్, విషయం లేకుండాపోయిందని విమర్శించారు.
తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రహ్లాద్ జోషి చర్చించారు.
‘‘స్విస్ చాక్లెట్ లేదంటే బెల్జియన్ చాక్లెట్స్ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.