Home » TG Govt
ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం ప్రకటించింది.
సుంకిశాల ఇన్టేక్ వెల్లో టన్నెల్ గేటు ధ్వంసమై రక్షణ గోడ కూలిపోయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేసింది.
పాఠశాల విద్యార్థులకు విద్యా బోధనలో నాణ్యతను మరింత పెంచేందుకుగాను ఉపాధ్యాయులకు అప్రయిజల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మేజర్ మినరల్స్కు సంబంధించిన గనుల వేలంపై పీడముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరేళ్లుగా ఎలాంటి స్పందనా లేదు. ఏదైనా మేజర్ మినరల్కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది.
తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారుచేసి కేంద్రానికి పంపించాలని సూచించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకం బీసీ ఉద్యమానికి భావజాల ఆయుధం అవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు.
సుంకిశాల పంప్హౌస్ ఇన్టేక్ వెల్ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే రిటైనింగ్ వాల్ కుప్పకూలిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రక్షాళన చేస్తామని, అభివృద్ధికి నిధులు సమకూరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2004 నుంచి 2014 వరకు హాస్టళ్లలో చదివే విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉండేవని, ప్రతి నెలా వైద్యులు వచ్చి వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, కార్డులో రాసే వారని గుర్తుచేశారు.