Home » Weather
AP and TG Weather Updates: తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉంది. కాసేపు ఎండలు దంచుతుండగా.. మరికాసేపు ఈదురు గాలులు, వడగళ్ల వానతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రెమాల్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది.
'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ అల్పపీడనం కాస్తా తుపాన్గా మారడంతో అక్కడక్కడ చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది.
గతవారం ఉపరితల ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తగ్గాయి.
రెండు మూడు రోజులకు ఒకసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ఏపీ ప్రజలకు షాకింగ్ వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని తెలిపింది. అవును, వర్ష సూచన ఉన్నప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ..