Dharmapuri Arvind Sawal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సవాల్ విసిరారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతోన్న హైడ్రాను.. హైదరాబాద్ ఓల్డ్ సీటీలో అమలు చేయగలరా? అని సూటిగా ప్రశ్నించారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డు సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు చేయడంపై పెద్దఎత్తున ధర్మా చేపట్టారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్కు పసుపు పోటెత్తింది. సీజన్ ప్రారంభమైన తర్వాత సోమవారం మొదటిసారి అత్యధికంగా 23,744బస్తాల పసుపు వచ్చింది. కొన్ని రోజులుగా పసుపు ధర క్వింటాలు రూ.10వేలకు
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.
కామారెడ్డి: దోమకొండ మండలం గడికోట(Gadikota) మహాదేవుడి ఆలయాన్ని బాలీవుడ్(Bollywood), హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి ఆలయం వద్దకు చోప్రా చేరుకున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల్పూర్ వద్ద స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసామని, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. జక్రాన్ పల్లి వద్ద ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపించాలన్నారు. పసుపు బోర్డులో అందరికీ అవకాశం ఇవ్వాలని, బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి రైతుల కోసం పని చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైనా నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్కు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి.
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.
Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.
MLC K Kavitha: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.