Nara Bhuvaneshwari: మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ ఆలోచన

ABN , First Publish Date - 2023-10-02T17:39:38+05:30 IST

మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ నేతల ఆలోచన అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు దీక్ష చేపట్టారు.

Nara Bhuvaneshwari: మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ ఆలోచన

రాజమండ్రి: మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ నేతల ఆలోచన అని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను కొద్ది సేపటి క్రితం విరమించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...‘‘ చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కోసమో.. మా కుటుంబం కోసమో కాదు.. రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. మహాత్మాగాంధీ లాంటి వారికే జైలు జీవితం తప్పలేదు. ఏనాడు మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవు. మేం ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకి వెళ్లారు. ప్రజలకు సేవ చేయాడానికి చంద్రబాబు నిత్యం పరితపించారు. చంద్రబాబు నీతిగా బతికారు. మా తండ్రి ఎన్టీఆర్ నీతిగా బతకటం నేర్పారు. చంద్రబాబు జైలులో, లోకేష్ డిల్లీలో, నేను బ్రాహ్మణి రాజమండ్రిలో ఉన్నాం. ఇలాంటి రోజు మా కుటుంబానికి వస్తుందనే అనుకోలేదు. చంద్రబాబు ఎప్పుడూ పోలవరం, అమరావతి కోసమే ఆలోచించేవారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు.చంద్రబాబు మీద నమ్మకంతో హైదరాబాద్‌లో.. బిల్‌ క్లింటన్‌, బిల్‌ గేట్స్ పెట్టుబడులు పెట్టారు. ప్రజల సొమ్ము పై మాకు ఆశలేదు. హెరిటేజ్ మాకు సరిపోతుంది. మహిళలు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారంటే చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. ఇటీవల మృతిచెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిసి వారికి దైర్యం చెబుతాను. ప్రజల పక్షాన పోరాటం చేస్తాను. ప్రపంచమంతా చంద్రబాబు కోసం దీక్షలు చేస్తున్నారు.’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T18:41:51+05:30 IST