Nara Lokesh: నాపై మూడు కేసులు పెట్టినా తగ్గేదేలే....

ABN , First Publish Date - 2023-10-02T18:07:40+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంచి పనులు చేస్తే సైకో జగన్ జైల్‌కి పంపించారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యానించారు.

Nara Lokesh: నాపై మూడు కేసులు పెట్టినా తగ్గేదేలే....

ఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంచి పనులు చేస్తే సైకో జగన్ జైలుకి పంపించారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కొద్దిసేపటి క్రితం చిన్నారులు లోకేష్‌కు నిమ్మరసం ఇచ్చి సత్యాగ్రహ దీక్ష విరమింపజేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో లోకేష్, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్థిలాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘మహాత్మాగాంధీ లాంటి వారు నమ్ముకున్న సిద్దాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో అమలయిన స్కిల్ డెవలప్మెంట్ ఏపీలో అమలు చేస్తే చంద్రబాబు నాయుడును సైకో జగన్‌రెడ్డి జైల్‌కు పంపారు. చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తే ఏపీకి పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబును జైలుకు పంపాలని పని చేస్తోంది.

ఏమి లేని కేసులో చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు. ఏపీ ప్రజలు ఆలోచించాలి ప్రజలు, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి చంద్రబాబు. ‘‘మోత మోగిద్ధాం’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అమ్మ భువనేశ్వరి శాంతియుతంగా దీక్ష చేయాలని కోరారు. ఆమె పిలుపు మేరకు దీక్ష చేశాం. ఇప్పటి నుంచి జగన్ పేరు మార్చాను.. ఆయన సైకో కాదు..పిచ్చి జగన్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు, పిటీ వారెంట్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. నాపై జగన్‌రెడ్డి మూడు కేసులు సిద్ధం చేశారు. కొందరు వైసీపీ మంత్రులు నన్ను జైలుకు పంపిస్తాం అంటున్నారు. వీలైతే అమ్మ భువనేశ్వరిని జైలుకు పంపిస్తా అంటున్నారు. మేము తగ్గేదేలే.... మా పోరాటం ఆగదు. ఇప్పటికీ నాపై మూడు కేసులు ఉన్నాయి. రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. నా శాఖకు సంబంధ లేని నిర్ణయాలు. కోర్టులు మమ్మల్ని కాపాడుతాయి. పిచ్చోడు జగన్ చేసే నిర్ణయాలు ఇవి. అందుకే జగన్ పేరు పిచ్చి జగన్. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో క్వాష్ పిటీషన్ వస్తుంది. కోర్టు నిర్ణయాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T18:37:29+05:30 IST