Share News

wife: ఇలాంటి భార్య కూడా ఉంటుందా.. అర్ధరాత్రి నిద్రలేచి భర్తను చూసిన ఆమె.. కాసేపటికి ఇంటి వరండాలోకి వెళ్లి..

ABN , First Publish Date - 2023-10-14T19:17:15+05:30 IST

కొందరు దంపతులు చీటికీమాటికీ గొడవలు పడుతూ కాపురాన్ని కలహాలమయంగా మార్చుకుంటుంటారు. మరికొందరు దంపతులు అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇంకొందరైతే చావైనా, బతుకైనా నీతోనే అన్నట్లుగా జీవిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. తాజాగా...

wife: ఇలాంటి భార్య కూడా ఉంటుందా.. అర్ధరాత్రి నిద్రలేచి భర్తను చూసిన ఆమె.. కాసేపటికి ఇంటి వరండాలోకి వెళ్లి..

కొందరు దంపతులు చీటికీమాటికీ గొడవలు పడుతూ కాపురాన్ని కలహాలమయంగా మార్చుకుంటుంటారు. మరికొందరు దంపతులు అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇంకొందరైతే చావైనా, బతుకైనా నీతోనే అన్నట్లుగా జీవిస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటన.. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అనారోగ్యంతో ఉన్న భర్త ఇక లేడన్న విషయం తెలుసుకున్న భార్య.. అర్ధరాత్రి సమయంలో ఏం చేసిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) జలౌన్ కొత్వాలి పరిధి గణేష్ జీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఉమేష్ చంద్ర చౌరాసియా (60) అనే వ్యక్తికి.. భార్య కవిత, అర్పిత్, సాగర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలావుండగా, ఉమేష్ చంద్ర గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో (illness) బాధపడుతున్నాడు. దీంతో ఎంతోమంది వైద్యుల వద్ద చూపించారు. అయినా అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ మందులు తీసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఉమేష్ నిద్రపోయాడు.

Teacher crime: కొత్తగా చేరిన మహిళా టీచర్‌‌పై.. కొన్నాళ్లకే వరుస ఫిర్యాదులు.. పట్టరాని కోపంతో చివరకు ఆమె చేసిన పని..

అయితే భర్త ఆరోగ్యం ఎలా ఉందో అనే ఆందోళనతో భార్య.. అర్ధరాత్రి నిద్రలేచి చూసింది. అయితే అప్పటికే అతను చనిపోవడం (Husband died) చూసి తట్టుకోలేకపోయింది. చాలా సేపు ఒంటరిగా కూర్చుని విలపించింది. చివరకు భర్త లేని లోకంలో తానూ ఉండకూడదని నిర్ణయించుకుంది. కొన్ని గంటల అనంతరం ఇంటి వరండాలో చీరతో ఉరివేసుకుని (wife suicide) ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం నిద్రలేచిన ఉమేష్ కుమారులు తల్లిదండ్రుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Crime news: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన యువతికి సీఐతో పరిచయం.. ఓ రోజు ఉన్నట్టుండి అతనే ఇంటికి రావడంతో..

Updated Date - 2023-10-14T19:17:15+05:30 IST