Share News

AP Elections: స్వామి సన్నిధిలో అబద్ధం చెప్పను.. : ఎంపీ రఘురామ

ABN , Publish Date - May 17 , 2024 | 10:05 AM

Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

AP Elections: స్వామి సన్నిధిలో అబద్ధం చెప్పను.. : ఎంపీ రఘురామ
MP Raghuram Krishnam Raju

తిరుమల, మే 17: ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందన్నారు.

AP Election Results: ఏపీలో ఎవరికి ఎన్నిసీట్లు? జోరుగా బెట్టింగులు..


వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. స్వామి సన్నిధిలో అబద్దాలు మాట్లాడనని అన్నారు. జగన్ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీ తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: రాష్ట్రంలో మళ్లీ భూమ్‌..

YSRCP: వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోలు బాంబులు

Read Latest AP News And Telugu News

Updated Date - May 17 , 2024 | 03:32 PM