Share News

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..

ABN , Publish Date - Jun 04 , 2024 | 10:30 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..
PM Modi

సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది. తొలిరౌండ్‌లో అయితే ఎస్పీ 50కి పైగా స్థానాల్లో అధిక్యాన్ని కనబర్చింది. తర్వాత రౌండ్ల కౌంటింగ్ ప్రారంభమయ్యాక ఎస్పీ అధిక్యత తగ్గింది. ఇదే క్రమంలో ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నియోజకవర్గంలో తొలిరౌండ్‌లో అక్కడి ఓటర్లు మోదీకి షాక్ ఇచ్చారు. తొలిరౌండ్ తర్వాత మోదీ 6వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత రెండో రౌండ్ నుంచి మోదీ అధిక్యంలోకి వెళ్లారు. ప్రస్తుతం 15వేలకు పైగా ఓట్లతో ప్రధాని మోదీ అధిక్యంలో ఉన్నారు.

Lok Sabha Elections 2024: నెహ్రూ రికార్డుపై మోదీ కన్ను.. చరిత్ర సృష్టిస్తారా?

Lok Sabha Elections 2024: బీజేపీ తొలి విజయం.. అక్కడ బోణీ కొట్టిన కాషాయ పార్టీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read National News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 10:30 AM