Share News

Minister Sandhyarani: జగన్ పేరు కూడా మర్చిపోయారు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:40 PM

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు మాజీ సీఎం జగన్ రెడ్డి లేఖపై మంత్రి సంధ్యా రాణి (Minister Sandhyarani) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగనుకు లేదని చెప్పారు.

Minister Sandhyarani: జగన్ పేరు కూడా మర్చిపోయారు.. మంత్రి  వ్యంగ్యాస్త్రాలు
Minister Sandhyarani

అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు మాజీ సీఎం జగన్ రెడ్డి లేఖపై మంత్రి సంధ్యా రాణి (Minister Sandhyarani) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగనుకు లేదని చెప్పారు. 11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్ష హోదాను ఎలా అడుగుతారు..? అని ప్రశ్నించారు. అసలు సభ అంటే జగన్‌కు గౌరవం ఉందా..? అని నిలదీశారు. తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా సభలో కూర్చొని వ్యక్తి జగన్ ఒక్కరేనేమో..? అని ప్రశ్నించారు.


ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కొందరు ఇతర పదాలు తప్పుగా మాట్లాడతారని.. కానీ జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన పేరే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరన్నారు. తాము పిలిచినా స్పీకరుకు జగన్‌ కనీసం గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారు..? అని ప్రశ్నించారు. మహిళలను గత ప్రభుత్వం ఎంతలా ఏడిపించిందో అందరికి తెలుసునని అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2024 | 03:50 PM