Share News

CM Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:54 AM

Andhrapradesh: ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కలిశారు. బాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్,ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

CM Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu Delhi Tour

న్యూఢిల్లీ, జూలై 5: ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను (Union Minister Nirmala Sitharaman) చంద్రబాబు కలిశారు. బాబుతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

Bhanuprakash: శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేయాల్సించాల్సిందే..


కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశమవుతారు. అనంతరం 11:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ అవనున్నారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

BRS: బీఆర్ఎస్ నుంచి మరో కీలక వికెట్ ఔట్..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:29 AM