Share News

Kishan Reddy:శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:57 PM

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుపట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఓకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నారని తెలిపారు.

Kishan Reddy:శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తాం
Kishan Reddy

హైదరాబాద్: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుపట్టారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఓకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని కోరుకున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్టికల్ 370 డి రద్దు చేశారని గుర్తుచేశారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 03:57 PM