Share News

YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:37 PM

YS Sharmila: వైసీపీ అసెంబ్లీకి వెళ్లే దమ్ముందా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై సభలో పోరాడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్
YS Sharmila

విజయవాడ: వైసీపీ (YSRCP) నేత బొత్స సత్యనారాయణపై (Botcha Sathyanarayana) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఖాళీగా ఉన్నది ఎవరో, రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్నది ఎవరో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అని విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వైసీపీపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని ఆక్షేపించారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో తెలుసునని విమర్శించారు. ఐదేళ్లలో ఎలాంటి పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆరోపించారు. ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారని ఎద్దేవా చేశారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారని మండిపడ్డారు.


పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు. ప్రజల సంపదను ప్యాలెస్‌కు మళ్లించుకున్నారని విమర్శించారు. ఐదేళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని తెలిపారు. ఐదేళ్లు పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని మండిపడ్డారు. 151 సీట్ల నుంచి వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని.. అయినా కూడా మీ వైఖరీలో మార్పు రావడం లేదని విమర్శించారు. చివరకు ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మిర్చి రైతుల కష్టాలపై వైసీపీ కంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని తాము ప్రశ్నించామని తెలిపారు. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు.


ALSO READ: GV Reddy: వారితో కుట్ర చేస్తున్నారా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీపై జీవీరెడ్డి ఫైర్

కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశామని అన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలను వెంటనే అమలు చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. ప్రతి నెల కూటమి హామీలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని గుర్తుచేశారు. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్లే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్లాలని డిమాండ్ చేశామన్నారు. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని వైసీపీని అడిగామని అన్నారు.


చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనమని ఆక్షేపించారు. మళ్లీ మళ్లీ వైసీపీని అడుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే అంశంపై వైసీపీ పాలసీ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్‌లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసిందని విమర్శించారు. దమ్ముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూాడా చదవండి

CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే

Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే

GV Reddy: వారితో కుట్ర చేస్తున్నారా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీపై జీవీరెడ్డి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:15 PM