Home » Anantapur urban
రామకృష్ణ సేవాసమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం మూడవరోడ్డులోని జీఆర్ ఫంక్షన హాల్లో సాయిట్రస్టు ఆధ్వర్యంలో గిరిజా కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 27 నుంచి నిర్వహిస్తున్న వేడుకలు బుధవారం ముగిశాయి.
అనంతపురం నగరంలో లక్ష మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక నీరు-ప్రగతి పార్క్లో గ్రీన ఆర్మీ నిర్వాహకుడు అనిల్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతపురం రూరల్ మండలం గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో వైసీపీ నాయకుల చేతుల్లో ఉన్న శోత్రియం భూములను రక్షించాలని బీజేపీ ఉరవకొండ అసెంబ్లీ కన్వీనర్, కురుబ సంఘం నాయకుడు కొనకొండ్ల రాజేష్ డిమాండ్ చేశారు.
బాల్య వివాహాలవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఐసీడీఎస్ శాఖ బాల్యం చదువుకోసం.. వివాహం కోసం కాదు అంటూ ప్రత్యేక స్లోగనతో పోస్టర్లు ముద్రించారు. పోస్టర్లను సోమవారం రెవెన్యూభవనలో కలెక్టరు వినోద్ కుమార్ చేతులు మీదుగా ఆవిష్కరించారు.
తెలుగు భాషకు వెలుగులు నింపిన ప్రగతిశీల మానవతావాద కవి సినారె అని పలువురు వక్తలు కొనియాడారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సినారెగా పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్ సి నారాయణరెడ్డి 93వ జయంతిని మహాకవి గుర్రం జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశాలాంధ్ర బుక్హై్సలో నిర్వహించారు.
అనంతపూర్ క్లబ్లో ఎటువంటి వివాదాలు, రాజకీయ, కుల, మతాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచించారు. 78ఏళ్ల చరిత్ర కలిగిన అనంతపూర్ క్లబ్ను సోమవారం ఆయన సందర్శించారు.
కౌలు రైతులు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమాహేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కక్కలపల్లి ఆర్ఎ్సఏలో కౌలు రైతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ అత్యవసర చికిత్సగా మారడంతో జిల్లా ఆస్పత్రిలో శనివారం డాక్టర్లు, వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని ఎస్ఎ్ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆర్ఐఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
అనంత జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై పాలకులు వివక్ష చూపడం అన్యాయమని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు.