Home » AP Assembly Speaker
మాజీ సీఎం జగన్కు కనీసం సభ మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyannapatrudu) అన్నారు.స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు.
అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై(ABN Andhra Jyothy) గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని.. కొత్త ప్రభుత్వం తొలగించింది. ఏబీఎన్తో పాటు మరో రెండు ఛానల్స్పై గత అసెంబ్లీ విధించిన నిషేధాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తొలగించారు.
స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్కు దీనిపై సమాచారం అందించాలని కూడా తెలిపారు. అయినా సరే.. వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వేరెవ్వరూ హాజరు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ ప్రారంభమైంది.
అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శాసనసభలో లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు.
ఆంధ్రప్రప్రదేశ్ అసెంబ్లీలో(Andhra Pradesh Assembly) డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడుని(Assembly Speaker Ayyanna Patrudu) ఎన్నుకున్నత తరువాత..
నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ డుమ్మా కొట్టనున్నట్టు తెలుస్తోంది. సభా సంప్రదాయాలు ప్రకారం నిన్ననే స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు అధికారపక్షం చెప్పింది. అయినా కూడా ఆ పార్టీ అధినేత స్పీకర్ ఎన్నిక పట్ల ఆసక్తి కనబరచకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.