Home » Rythu Bandhu
రాష్ట్రవ్యాప్తంగా 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 34.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,218.49 కోట్ల మేర నిధులు జమ అయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలుండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10 శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది.
సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ.. రైతుబంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నంబర్లవారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.
అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్. ఫక్తు కమర్షియల్ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు.
రైతుభరోసా సర్వే పకడ్బందీగా చేయాలని.. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలోని తెల్లాపూర్లో ఓ రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో ఆ భూమి ధర ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది.
రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ కాబోతోంది. సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి.
CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఎకరానికి ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4గంటలకు సచివాలయంలోని క్యాబినెట్ హాలులో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధానంగా రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.