Home » TG Govt
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో చాలావరకూ అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని.. వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని.. నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా, గడువు ముగిసిన (ఎక్స్పైర్డ్) ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ) తనిఖీల్లో వెల్లడైంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 589.50 అడుగుల (310.25 టీఎంసీలు)కు చేరింది. కుడి కాల్వ ద్వారా 7,086 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,629 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం నుంచి 29,232 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
స్వచ్ఛదనంపై మరింత శ్రద్ధ పెరగాలని మంత్రి సీతక్క (Minister Seethakka) సూచించారు. ‘స్వచ్ఛదనం - పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతంపై జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో డైటీషియన్ పోస్టుల పదోన్నతుల్లో వసూళ్ల పర్వం మొదలైంది. కొందరు యూనియన్ నేతలు సీనియారిటీ జాబితాలో ఉన్నవారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్కు (Jaya Shankar) లేఖ రాశారు. పాస్పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య(62) సమస్యను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో ప్రాజెక్టులు పూర్తికాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా వెనుకబడ్డ దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని తెలిపారు. డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆదివారం నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు.
కాంగ్రెస్ ఎగవేత... కోతల ప్రభుత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఎల్లప్పుడూ వారి సేవలోనే ఉంటానని తెలిపారు. పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు బంగారం మాటలకే పరిమితమైందని హరీష్రావు విమర్శించారు,