Share News

AP News: శ్రీశైలంలో తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - May 16 , 2024 | 01:57 PM

Andhrapradesh: శ్రీశైలంలో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. అయితే లోయలో పడి చెట్టుకు ఢీ కొట్టి వాహనం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు.

AP News: శ్రీశైలంలో తప్పిన పెను ప్రమాదం..
Bolero vehicle fell into the valley

నంద్యాల, మే 16: శ్రీశైలంలో (Srisailam) పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో బొలేరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. అయితే లోయలో పడి చెట్టుకు ఢీ కొట్టి వాహనం ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నారు. అయితే వీరంతా స్వల్ప గాయలతో సురక్షితంగా బయటపడ్డారు.

AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్


వీరంతా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన యాత్రికులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సుండిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లన్న దర్శనార్థం శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Government: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్

TDP: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 02:30 PM