Share News

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:31 AM

లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్‌, మహమ్మద్‌ జావేద్‌లను నియమించింది.

Delhi : లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్‌ గొగోయ్‌

స్పీకర్‌కు సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియా లేఖ

న్యూఢిల్లీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్‌, మహమ్మద్‌ జావేద్‌లను నియమించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లేఖ రాశారు.

ఇదే విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మార్గనిర్దేశంలో కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలు ప్రజా సమస్యలపై సమష్ఠిగా పోరాడతాయని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటివరకు సురేశ్‌ (మావేలికర) కేరళ నుంచి 8 సార్లు ఎంపీగా గెలవగా.. మాణిక్కం ఠాగూర్‌ (విరుదునగర్‌) తమిళనాడు నుంచి 3 సార్లు, జావేద్‌ (కిషన్‌గంజ్‌) బిహార్‌ నుంచి 2 సార్లు గెలిచారు.

Updated Date - Jul 15 , 2024 | 04:31 AM