Share News

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్

ABN , Publish Date - May 08 , 2024 | 11:03 AM

Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్
BJP MP Candidate Bandi Sanjay

సిరిసిల్ల, మే 8: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు (BJP MP Candidate Bandi Sanjay) మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు. కాంగ్రెస్ చవటల్లారా మోదీని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దేశం.. ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని.. సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలని వ్యాఖ్యలు చేశారు.

PM Modi Live:: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న మోదీ.. బహిరంగసభలో ప్రధాని ప్రసంగం..


మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు బాస్మాసుర అస్త్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక గాడిద గుడ్డు అంటూ సెటైర్ విసిరారు. ‘‘మీరు ఆరు గ్యారంటీల దొంగల బ్యాచ్’’ అని మోదీ ఆరడుగుల బుల్లెట్ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TS News: బాచుపల్లి ఘటనపై కేసు నమోదు

TS News: గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 12:14 PM