Share News

Minister Prabhakar: కిషన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే... రాష్ట్రంలో సీబీఐపై బ్యాన్ ఎత్తివేస్తాం

ABN , Publish Date - Jan 02 , 2024 | 08:39 PM

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) స్క్రిప్ట్‌ను బీజేపీ ( BJP ) నేతలు చదివారని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు సచివాలయం మీడియా పాయింట్‌లో మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6వ తేదీనే చివరి రోజని.. మళ్లీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసునని చెప్పారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Minister Prabhakar:  కిషన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే... రాష్ట్రంలో సీబీఐపై బ్యాన్ ఎత్తివేస్తాం

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) స్క్రిప్ట్‌ను బీజేపీ ( BJP ) నేతలు చదివారని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు సచివాలయం మీడియా పాయింట్‌లో మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6వ తేదీనే చివరి రోజని.. మళ్లీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసునని చెప్పారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని చెప్పారు. బీఆర్ఎస్‌కు బీజేపీతో దోస్తీ ఉందన్నారు. గోషామాల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదని.. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఇప్పకాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ విచారణను బీజేపీ అడుగుతుందన్నారు. జ్యుడీషియల్ విచారణకు కేంద్రం ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని చెప్పారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే...కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదన మేరకే బండి సంజయ్‌ని మార్చి కిషన్‌రెడ్డిని నియమించారని చెప్పారు. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అని ఎద్దేవ చేశారు. బీజేపీని ఎదురిస్తే సీబీఐ, ED కేసులు ఉంటాయని.. ఇందులో కేసీఆర్ కుటుంబానికి మినహాయింపు ఉంటుందని ఎద్దేవా చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ది అపవిత్ర కలయిక

కిషన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సీబీఐపై బ్యాన్ ఎత్తివేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.ఇప్పటికే బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే పరిస్థితి లేదని చెప్పారు. కేంద్ర మంత్రి పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. కిషన్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పారు. బీజేపీది, బీఆర్ఎస్‌ది అపవిత్ర కలయిక అని హేలన చేశారు. వాళ్లు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదన్నారు. కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ పదే పదే అన్నదని గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్ అని కూడా బీజేపీ అన్నదన్నారు. కేసీఆర్‌కు తొత్తుగా మాట్లాడవద్దని... మాట్లాడే ముందే ఆలోచన చేయాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్ కుటుంబం అనేక తప్పులు చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు సోకులకు కాదు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమేనని చెప్పారు. కిషన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సీబీఐపై బ్యాన్ ఎత్తివేస్తామని చెప్పారు. ట్రక్ డ్రైవర్లు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రవాణా చట్టాన్ని కొంతకాలం నిలిపివేయాలని కోరారు. ట్రక్ యజమానుల సమ్మెపై కేంద్రం వెంటనే చర్చలు జరిపాలని సూచించారు. ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇతరత్రా అన్ని వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా.. అయినా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Updated Date - Jan 02 , 2024 | 08:39 PM