Home » Mancherial
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యవసాయ భూములను నివాస ప్లాట్లుగా మార్చేందుకు నాలా (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసస్మెంట్ యాక్టు) కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు, ఇతర సదుపాయాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల చేతులు తడప నిదే కన్వర్షన్ కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్, సింగరాయిపేట, రోటిగూడ, చింతగూడ గ్రామాల్లో పర్య టించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి మార్గదర్శకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అసాంఘిక కార్యక్రమాలకు జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. జూదం, వ్యభిచారం, సెటిల్మెంట్లు, గంజాయి వినియోగం, మారణాయుధాల రవాణా నిత్యకృత్యమైంది. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి ఇక్కడ దందాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు పోలీసు దాడులు జరుగుతున్నా.... మరో వైపు యథేచ్ఛగా అక్రమ దందాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిపై నమ్మకంతో చికిత్స కోసం వచ్చే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్రావు అన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అన్ని వార్డులు పరిశీలించారు.
నిరక్షరాస్యత కారణంగా మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పట్టణాలతో పోల్చితే పల్లెల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అక్షర వెలుగులు నింపే లక్ష్యంతో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆదిమ గిరిజనులైన కొలాంలు నివసించే కొలాంగూడకు అండగా ఉం టామని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు. ఆది వారం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి కొలాం గూడలో రూ.38.15 లక్షలతో నిర్మించే పాఠశాల భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పలు వురు కొలాంగూడ వాసులు తాము అడవికి వెళ్లి వెదురు బొంగు తెచ్చుకునేందుకు అటవీ అధికారు లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకు మొర పెట్టుకు న్నారు.
ప్రధాని మోదీ కార్పొరేట్లకు ఊడి గం చేస్తున్నాడని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు పేర్కొ న్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ళుగా ప్రధాని మోదీ కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేశాడని, కార్మికులను, ప్రజలను పట్టించుకోలేదన్నారు.
మంచిర్యాల జిల్లా కేం ద్రంలో రివాల్వర్తో బెదిరించిన సంఘటన కలకలం రేపింది. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. నెన్నెల మండ లం ఆవడం గ్రామానికి చెందిన జితేందర్ స్వాతి దంపతుల మధ్య గొడవలతో మూడు నెలల నుంచి స్వాతి ఏసీసీలోని పుట్టింట్లో ఉంటుందని పేర్కొ న్నారు.
మరణించిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంఘటన దండేపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ తతంగం తహసీ ల్దార్ కార్యాలయ సిబ్బందే నడిపించగా, విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది.