Home » New Delhi
దేశంలో పెరుగుతున్న డిజిటల్ వేదికలు, ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా యాప్ల నియంత్రణ కోసం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ కొత్త కౌన్సిల్ ముద్రణ, డిజిటల్, ప్రసార మాధ్యమాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చే ప్రతిపాదనను సమర్థించింది
ర్యాపిడో పింక్ మొబిలిటీ పథకం ద్వారా 2 లక్షల మహిళలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ప్రస్తుతం మూడు నగరాల్లో 700 మందికి పైగా మహిళలకు ఉద్యోగాలు అందిస్తోంది
భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారంపై ధన్ఖడ్ మాట్లాడుతూ, ఇది కచ్చితంగా చాలా తీవ్రమైన అంశమని అన్నారు. దీనిపై కార్యచరణకు సంబంధించి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయమని ఖర్గే సూచించగా, జేపీ నడ్డా అంగీకరించినట్టు తెలిపారు.
పార్టీల సిద్ధాంతాలు, విధానాల విషయంలో 'ఇండియా' కూటమి భాగస్వామ పార్టీల మధ్య సల్ప తేడాలు ఉండవచ్చనీ, కానీ దేశ విద్యా వ్యవస్థ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని రాహుల్ గాంధీ అన్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.
కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెబుతున్న విజువల్స్ తనపై బురదజల్లి, తన ప్రతిష్టను భంగపరచేందుకు జరిగిన కుట్రగా కనిపిస్తోందని జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పారు. వీడియోలోని కంటెంట్ చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభంకానున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్ సభ స్పీకర్ అవకాశం కల్పించారు. దీంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతి ఇచ్చింది.
'వికసిత్ ఢిల్లీ బడ్జెట్' రూపకల్పన కోసం నిపుణులతో సహా వివిధ వర్గాలను తమ ప్రభుత్వం సంప్రదించిందని, ప్రజల నుంచి ఇ-మెయిల్ ద్వారా 3,300 సూచనలు, వాట్సాప్ ద్వారా 6,982 సూచనలు వచ్చాయని సీఎం రేఖాగుప్తా తెలిపారు.
ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వేటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు. దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది.