Share News

Hanumantha Rao: ఎమర్జెన్సీపై మాట్లాడే వాళ్లకి గోద్రా కనిపించలేదా..?

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:40 PM

ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు.

Hanumantha Rao: ఎమర్జెన్సీపై మాట్లాడే వాళ్లకి గోద్రా కనిపించలేదా..?
V. Hanumantha Rao

హైదరాబాద్: ఎమర్జెన్సీ కనిపించిన వాళ్లకి గోద్రా కనిపించలేదా? అని టీపీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు (Hanumantha Rao) ప్రశ్నించారు. ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిందని కొనియాడారు. ఈరోజు(బుధవారం) గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఆమె దేశానికి ఏం తక్కువ చేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ గూర్చి మాట్లాడితే తాము గోద్రా గురించి మాట్లాడుతామని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఎమర్జెన్సీ భాష మాట్లాడితే తాము గోద్రా భాష మాట్లాడతామని వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Jun 26 , 2024 | 07:06 PM