Share News

Buddha Venkanna: ఖబర్దార్ కొడాలి నాని.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:00 PM

నేడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. గతంలో చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

 Buddha Venkanna: ఖబర్దార్ కొడాలి నాని.. బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్
Buddha Venkanna

విజయవాడ: నేడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. గతంలో చంద్రబాబుతో పాటు, ఆయన సతీమణి పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కౌరవ సభలో ఉండలేనని, గౌరవ సభలో సీఎంగా వస్తానని ప్రతిన బూని మరీ చంద్రబాబు ఆరోజు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పుడు చెప్పిన విధంగా మహారాజులాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టారని కొనియాడారు. ఈ ఘట్టం దేశ రాజకీయాల్లో ఒక చరిత్రగా నిలిచిపోతుందని అభివర్ణించారు. వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) మళ్లీ ఏదేదో మాట్లాడుతున్నారని.. తమ అధిష్ఠానం దాడులు వద్దని చెప్పిందని.. దాంతో తాము సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సైలెంట్‌ను చులకనగా చూడవద్దని హెచ్చరించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గురించి అభ్యతరకరంగా మాట్లాడుతావా కొడాలి నాని ఖబార్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.


జగన్ ఆర్థిక నేరస్తుడు..

‘‘ఇక నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నోటికొచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోం. జగన్ ఆర్థిక నేరస్తుడు.. త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం. నీ సంగతి ఏంటి..? పెన్షన్ నాలుగు వేలు చేస్తే... అభినందించలేవు. రుషికొండలో కట్టడాలు జగన్ కోసం కట్టించుకున్నారనేది వాస్తవం కాదా.? మొన్నటి వరకు మీరంతా ఏం చేశారు. ఇప్పుడు బొక్కలో వేస్తారనే భయంతో డ్రామా ఆడుతున్నారు. స్మగ్లర్లు, గంజాయి బ్యాచ్‌తో అంటకాగే మీరా చెప్పేది..? కొడాలి నానీ నీ గన్నవరం పిల్లి ఏమైంది.. అడ్రెస్ చెప్పు..? ఎవరి జోలికీ వెళ్లవద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చెప్పారు కాబట్టి శాంతంగా ఉంటున్నాం. మీరు రాజకీయంగా కాకుండా బూతులు మాట్లాడితే.. ఈసారి ఉన్న చోటకు వచ్చి తంతాం. దివంగత నేత కోడెల శివప్రసాద్ చావుకు మీ జగన్ కారణం కాదా..? ఇప్పుడు జగన్ ఫర్నిచర్ కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు..? అప్పుడు తప్పు అని మాట్లాడిన మీరు.. ఇప్పుడు డబ్బులు ఇస్తాం అంటారా..? రేపటి నుంచి దొంగలను పోలీసులు పట్టుకోగానే.. డబ్బులు ఇస్తామని చెబుతారు. ప్రజా ధనాన్ని దొంగిలించిన కేసులో 420సెక్షన్ కింద కేసులు పెడతారు. ఇప్పటికే రూ.42వేల కోట్లు దోచుకున్న గజదొంగ.. ఫర్నిచర్‌ను కూడా వదలకుండా ఎత్తుకుపోయాడు. కొడాలి నాని ముష్టి అంటావా.. సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు. ప్రజలు నిన్ను ఛీ కొట్టినా... మారలేదు..రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి’’ అని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Jun 21 , 2024 | 09:00 PM