Share News

Viral News: ప్రియురాలిని చూసి తల్లిదండ్రులతో సహా పారిపోయిన ప్రియుడు.. నాలుగు రోజుల తర్వాత పోలీసులు వెళ్లి విచారించగా..

ABN , First Publish Date - 2023-11-03T19:43:50+05:30 IST

ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై పడుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అన్ని ప్రేమలూ ఒకేలా ఉండవనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. కొందరైతే..

Viral News: ప్రియురాలిని చూసి తల్లిదండ్రులతో సహా పారిపోయిన ప్రియుడు.. నాలుగు రోజుల తర్వాత పోలీసులు వెళ్లి విచారించగా..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిపై పడుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే అన్ని ప్రేమలూ ఒకేలా ఉండవనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని చివరకు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకుంటారు. కొందరైతే ప్రేమించిన వారికోసం దేశ సరిహద్దులు దాచి వచ్చిన ఘటనలు కూడా చాలా చూశాం. అయితే మరికొందరు మాత్రం ప్రేమ పేరుతో ఒకరినొకరు మోసం చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటి ముందు ప్రియురాలిని చూసిన ప్రియుడు తన తల్లిదండ్రులతో సహా పరారయ్యాడు. నాలుగు రోజుల తర్వాత పోలీసులు వెళ్లి విచారించగా.. షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బస్తీ జిల్లా దుబౌలియా పరిధి రాంనగర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ ఉపాధి నిమిత్తం కొన్ని నెలల క్రితం దుబాయ్ (Dubai) వెళ్లాడు. అక్కడ వంట పని చేస్తుండేవాడు. అలాగే పంజాబ్‌ (Punjab) జలంధర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (young woman) కూడా దుబాయ్‌లో వంట పని చేస్తోంది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో పని చేస్తుండడంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి కూడా అతన్ని ఎంతో నమ్మింది. పెళ్లి పేరుతో అతను యువతిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం అతను సొంతూరుకు వచ్చాడు.

Viral News: 80 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు.. దూకొద్దని చెప్పిన పోలీసులకు అతడు ఇచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టిన జనం..

lovers-viral-news.jpg

విషయం తెలుసుకున్న యువతి.. తన ప్రియుడికి ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో వారం రోజుల క్రితం ఆమె దుబాయ్ నుంచి ఇండియా వచ్చింది. చివరకు తన సోదరిని తీసుకుని ప్రియుడి గ్రామానికి వెళ్లింది. ప్రియురాలు రావడం చూసిన ప్రియుడు.. ఇంటికి తాళం వేసి తన తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు. అయినా యువతి మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా అతడి ఇంటి ముందే ఆందోళన చేపట్టింది. మూడు రోజులు అక్కడే ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. యువతిని ప్రశ్నించగా విషయం మొత్తం చెప్పేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా ఎవరైనా ప్లాన్ చేస్తారా.. పెళ్లి మంటపంలో వీడియో ప్లే చేయడంతో.. అతిథులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి..

Updated Date - 2023-11-03T19:44:08+05:30 IST