AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్పోల్.. ఆ పార్టీదే విజయం..!
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:46 PM
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి. మెజార్టీ సర్వేలు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ సంస్థ పోస్ట్పోల్ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. మే16 నుంచి మే20వ తేదీలోపు 175 నియోజకవర్గాల్లోని 6,900 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం నాలుగు పోలింగ్ బూత్ల నుంచి శాంపిల్స్ సేకరించింనట్లు తెలిపింది.
AP Election Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిది.. ఒకే ఒక్క క్లిక్తో తెలుసుకోండి..
కూటమిదే అధికారం..
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 సీట్లు గెలుస్తుందని పీపుల్స్ పల్స్ తన పోస్ట్పోల్ సర్వేలో పేర్కొంది. మొత్తంగా కూటమికి 111 నుంచి 135 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 175 స్థానాల్లో పోటీ చేయగా.. టీడీపీ144, జనసేన 21, బీజేపీ 10 సీట్లలో పోటీ చేసింది.