అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టవద్దు

ABN , First Publish Date - 2022-11-07T00:22:01+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అనుమతి లేకుండా చేపట్టరాదని క్రైమ్‌ ఏడీసీపీ జి.గంగాధరం స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టవద్దు
‘ఉక్కు’ నాయకులతో మాట్లాడుతున్న క్రైమ్‌ ఏడీసీపీ గంగాధరం

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులకు సూచించిన క్రైమ్‌ ఏడీసీపీ గంగాధరం

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అనుమతి లేకుండా చేపట్టరాదని క్రైమ్‌ ఏడీసీపీ జి.గంగాధరం స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో స్టీల్‌ ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంగాధరం మాట్లాడుతూ ఈ నెల 12న ప్రధాని పర్యటన ముగిసేంత వరకు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుల నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ వి.శ్రీనివాసరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T00:22:01+05:30 IST

Read more