ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టవద్దు

ABN, First Publish Date - 2022-11-07T00:22:01+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అనుమతి లేకుండా చేపట్టరాదని క్రైమ్‌ ఏడీసీపీ జి.గంగాధరం స్పష్టం చేశారు.

‘ఉక్కు’ నాయకులతో మాట్లాడుతున్న క్రైమ్‌ ఏడీసీపీ గంగాధరం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులకు సూచించిన క్రైమ్‌ ఏడీసీపీ గంగాధరం

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 6: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అనుమతి లేకుండా చేపట్టరాదని క్రైమ్‌ ఏడీసీపీ జి.గంగాధరం స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో స్టీల్‌ ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గంగాధరం మాట్లాడుతూ ఈ నెల 12న ప్రధాని పర్యటన ముగిసేంత వరకు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసుల నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఏడీసీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ వి.శ్రీనివాసరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T00:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!