BJP : ఈటల అత్తగారి ఊరిలో బీజేపీకి 331 ఓట్ల లీడ్‌

ABN , First Publish Date - 2022-11-07T04:46:36+05:30 IST

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్‌ లభించింది.

BJP : ఈటల అత్తగారి ఊరిలో బీజేపీకి 331 ఓట్ల లీడ్‌
eetala rajender

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్‌ లభించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి ఈటల పలివెలలోనే మకాం వేసి తనకు అప్పగించిన మండలాల బాధ్యతలు చూశారు. అంతేకాక పలివెలలో బీజేపీకి అధిక ఓట్లు వచ్చేలా ఈటల దంపతులు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. గ్రామంలో మొత్తం 1,952 ఓట్లు పోల్‌ కాగా బీజేపీకి 1,029, టీఆర్‌ఎ్‌సకు 698, కాంగ్రె్‌సకు 101 వచ్చాయి. గ్రామంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున పంచాయని చెబుతున్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది బీజేపీకి లాభించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యత వహించారు.

Updated Date - 2022-11-07T04:46:36+05:30 IST

Read more