ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

BJP : ఈటల అత్తగారి ఊరిలో బీజేపీకి 331 ఓట్ల లీడ్‌

ABN, First Publish Date - 2022-11-07T04:46:36+05:30

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్‌ లభించింది.

eetala rajender
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్‌ లభించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి ఈటల పలివెలలోనే మకాం వేసి తనకు అప్పగించిన మండలాల బాధ్యతలు చూశారు. అంతేకాక పలివెలలో బీజేపీకి అధిక ఓట్లు వచ్చేలా ఈటల దంపతులు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. గ్రామంలో మొత్తం 1,952 ఓట్లు పోల్‌ కాగా బీజేపీకి 1,029, టీఆర్‌ఎ్‌సకు 698, కాంగ్రె్‌సకు 101 వచ్చాయి. గ్రామంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున పంచాయని చెబుతున్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది బీజేపీకి లాభించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధ్యత వహించారు.

Updated Date - 2022-11-07T04:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!