ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cyrus Mistry: సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసు.. గైనకాలజిస్ట్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-11-05T18:12:28+05:30

టాటాసన్స్ (Tata Sons) మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టాటాసన్స్ (Tata Sons) మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు తాజాగా ముంబై గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోలే(55)పై కేసు నమోదు చేశారు. సెప్టెంబరులో మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు అహ్మదాబాద్ నుంచి బయల్దేరి ముంబైకి వెళ్తుండగా వీరి కారు రాంగ్ సైడ్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తోంది.

ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న అనహిత పండోలే ( Anahita Pandole), ఆమె భర్త డారియస్ పండోలే (60) ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు తాజాగా కారు డ్రైవ్ చేసిన అనహిత పండోలేపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-11-05T18:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising