ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Krishna Mohan Reddy: ఆ ఘటన అనుకోకుండా జరిగిపోయింది

ABN, First Publish Date - 2022-11-22T19:16:53+05:30

జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్‌పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్‌పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని.. కార్యకర్తలతో ప్రిన్సిపాల్ గొడవ పెట్టుకోవడంతోనే నేను అలా వ్యవహరించాల్సి వచ్చిందిని సంజాయిషి ఇచ్చుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

గద్వాల జిల్లాలో బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Bandla Krishnamohan Reddy), జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా (ZP Chairperson Sarita)ను అధికారులు ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాకముందే పాఠశాలను జడ్పీ ఛైర్‌పర్సన్ ప్రారంభించారు. నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక.. ప్రిన్సిపాల్ గల్లా పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో మిగతా అధికారులు ఖంగుతిన్నారు.

Updated Date - 2022-11-22T19:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising