తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం ఆదివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాన్ని 40 మంది రుత్వికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.