ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Political BRO : ‘ బ్రో’ సినిమా వివాదంపై మొదటిసారి స్పందించిన పవన్ కల్యాణ్..

ABN, First Publish Date - 2023-08-04T17:28:07+05:30

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే అటు చిత్రబృందం.. ఇటు అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. ‘బ్రో’ మూవీపై ఫిర్యాదు చేయడానికి అంబటి హస్తినకు వెళ్లారు. అయితే ఇంత వివాదం జరుగుతున్నా ఇంతవరకూ స్పందించని పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.


నేనే వదిలేశా..!

రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి. నా సినిమా గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇష్యూను డైవర్ట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సినిమా గురించి, నన్ను తిట్టడం గురించి డిబేట్స్ ఎందుకు..?. పొలిటికల్ డిబేట్స్‌ను కొంతమంది తప్పుదోవ పట్టించి మిమ్నల్ని (జనసేన నేతలను) రెచ్చగొడుతున్నారు. నన్ను తిట్టారని మీరు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. మన జనసేనకు భాష ముఖ్యం.. విధానాలపై ప్రశ్నించండి. నా సినిమాను నేనే వదిలేశాను.. మీరు ఎందుకు ఆవేశపడతారు..?. కావాలనే చేసే కుట్రలో మీరు చిక్కుకోవద్దు. డిబేట్ తాలూకూ స్థాయి జనసేన నాయకుల ద్వారా పెరగాలి. వాళ్ల స్థాయికి మీరు దిగజారవద్దు. నన్ను తిడితే నా శరీరం ఏమీ చిల్లు పడిపోదు కదా. మనం ఏది మాట్లాడినా రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేలా ఉండాలి. నన్ను తిట్టినా ఏంకాదు.. రాజకీయాలు నడిపేందుకు సినిమాలు ఒక ఇంధనంఅని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రభుత్వంపై..!

ఏపీని పాలించడానికి వైఎస్ అనర్హుడు. అటువంటి వ్యక్తిని గద్దె దించాలి. దిష్టి బొమ్మను ఊరేగిస్తే మన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. అటువంటి వారికి మన నాయకులు అండగా ఉండాలి కదా..?. బీజేపీ నాయకులపై పోలీసులు దాడి చేస్తే నేను స్పందించాను. మన జనసేన నాయకులపై దాడి జరిగితే కనీసం స్పందించరా..?. ఎన్డీఏ సమావేశంలో మనకు ఇచ్చిన ప్రాధాన్యత చూశారు కదా.!. నిజాయితీగా పని చేస్తే గుర్తింపు అదే వస్తుంది. పరాజయంలో వచ్చే నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. అయినా ఎన్నో తట్టుకుని ప్రజల కోసం నేను నిలబడ్డాను. ఒక్కసారి మాట ఇస్తే కంఠం తెగి పడే వరకు అలాగే ఉంటాను. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటు చేస్తాం. నా భారతదేశం కోసం పని చేస్తున్నా అనుకోవాలి. జగన్, అతని అనుచరులు మానవ వనరులను దోపిడీ చేస్తున్నారు. వాటిపై అందరం కలిసి పోరాటం చేయాలి. ఇది మన జనసేన కేంద్ర కార్యాలయం. భవనం నిర్మాణం అయితే పూర్తి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. వెనుక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటాను. మంగళగిరిలోని జనసేన కార్యాలయం నా ఇల్లు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జనసేన నేతలకు క్లాస్!

జగన్ దుర్మార్గపు పాలనను తరిమి కొట్టాలి.. జనసేనను అధికారంలోకి తేవాలి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్దం గా ఉన్నారు.. నాయకులే లేరు. పది వేల ఓట్లు తెచ్చుకోలేని‌ వారు నాయకుడు అంటే ఎలా..?. నా చుట్టూ తిరిగితే నాయకులు అవ్వరు. కలిసినవారినే కలవడం అంటే నాకు సమయం వృథా. ప్రజలకు చేరవగా ఉంటూ వారిని తమ ఓటర్లుగా మార్చుకోవాలి. 2019 విధానం కాకుండా సరికొత్త విధానంలో అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. స్థానిక అంశాలు, అభిప్రాయాలు, సర్వే నివేదికల ద్వారా సీట్లు ఉంటాయి. అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లింది. విశాఖ వారాహి యాత్రతో మరింత బలంగా జనసేన దూసుకెళ్తోంది. అక్కడ దోపిడీ, దౌర్జన్యాలను ప్రజలకు వివరిస్తాం. ఒక ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పోలీసులు మౌనంగా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తరువాత అందరూ చూశారు. ఉభయ గోదావరి జిల్లాల తరహాలో విశాఖలో వారాహి యాత్రకు మంచి స్పందన ఉంటుంది. విశాఖ జిల్లాలో కూడా వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేద్దాం. మంచి నాయకులు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిద్దాం. మూడో విడత వారాహి యాత్రకు అందరూ సిద్దంకండి అని జనసేనాని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి


Political BRO : ‘బ్రో’ సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు


AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?


AP Politics : విశాఖ వైసీపీలో రివర్స్ గేర్.. ఏ ఒక్కర్ని కదిపినా పరిస్థితేంటో అని జగన్‌లో పెరిగిన టెన్షన్!?


TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?


Nandyal Politics : చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ, పోటీపై భూమా జగత్ విఖ్యాత్ ఆసక్తికర వ్యాఖ్యలు


YS Jagan And Sunitha : జగనన్న ఆరోగ్యం కోసం పరితపిస్తున్న సునీత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఫొటో వైరల్



Updated Date - 2023-08-04T17:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising