ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime Story: ఈ ఫొటోలు చూసి వీళ్లెంత గొప్ప ప్రేమికులో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ లేడీ డాక్టర్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ ఏంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-10T18:07:21+05:30

జమ్మూలో బాయ్‌ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైన వైద్యురాలు.. ఆమెను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రేమికుల(Couple) ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన వాళ్లందరూ ఎంత చూటముచ్చటైన జంటో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. లైక్, షేర్ చేస్తూ తమ మద్దతు తెలిపారు. కానీ.. ఇంతలోనే వారి కథ ఊహించని మలుపు తిరిగింది. ఈ లవ్ స్టోరీలో లేడీ డాక్టర్ అనూహ్యంగా మృతి చెందింది. హోలీ రోజున బాయ్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చిన ఆమెను అతడు కత్తితో హత్య చేశాడు. తనూ ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ములో(Jammu) బుధవారం వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

జమ్మూ నగరం సరిహద్దులోని జానీపూర్(Janipur) ప్రాంతంలోగల ఓ ఇంట్లో డా. సుమేధ శర్మ(Dr. Sumedha Sarma) దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఇంట్లో తనఖీ కోసం వెళ్లిన పోలీసులు సుమేధ శరీరం రక్తపుమడుగులో కనిపించింది. పక్కనే ఆమె బాయ్ ఫ్రెండ్ జోహార్ గనాయ్(Johar Ganai) కూడా అచేతనంగా పడి ఉన్నాడు. అతడు తనని తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవితం మీద విసుగొచ్చేసిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అతడు పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌ చూసిన బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు జోహార ఇంటికి వెళ్లి చూడగా.. ప్రధాన గేటుకు తాళం కనిపించింది. దీంతో..వారు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అచేతనంగా పడి ఉన్న ఆ ఇద్దరినీ పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. సుమేధ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. జోహార్‌కు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా.. డెంటిస్టులైన(Dentists) సుమేధ, జోహార్‌లు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ తరువాత సుమేధ పైచదువుల కోసం మరో రాష్ట్రానికి వెళ్లింది. హోలీ పండగ సందర్భంగా స్వరాష్ట్రానికి వచ్చిన ఆమె జోహార్‌ను చూడ్డానికి వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. తొలుత వారిద్దరి మధ్య వివాదం చెలరేగిందని, ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జోహార్‌ ఆమెపై కత్తితో దాడి చేసి చంపేసినట్టు సమాచారం. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ కేసులో పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-03-10T18:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising